Tuesday 2 May 2023

మోకాళ్ల_నొప్పులకు మరియు మోకాలులో గుజ్జు అరిగిన అప్పుడు నొప్పి నివారణ కు _ఆయుర్వేద లో Naveen Nadiminti సలహాలు

*#మోకాళ్ల_నొప్పులకు మరియు మోకాలులో  గుజ్జు అరిగిన అప్పుడు నొప్పి నివారణ కు _ఆయుర్వేద లో Naveen Nadiminti  సలహాలు ..!*
          మోకాళ్ల నొప్పులు అనేవి సహజంగా వృద్ధాప్యంలో చాలా మందికి వస్తుంటాయి. ఎముకలు బలహీనంగా మారడం, పోషకాల లోపంతోపాటు కీళ్ల మధ్యలో ఉండే గుజ్జు అరిగిపోవడంతో సహజంగానే మోకాళ్ల నొప్పులు వస్తుంటాయి. అయితే కింద తెలిపిన ఆయుర్వేద సలహాలు ను పాటించడం వల్ల మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. మరి ఆ సలహాలు ఏమిటంటే..

*home_remedies_for_joint_pains*

1. శొంటి, జీలకర్ర, పుదీనా ఆకులను 30 గ్రాముల చొప్పున తీసుకోవాలి. మిరియాలు 15 గ్రాములు తీసుకోవాలి. అన్నింటినీ కలిపి మెత్తగా పొడి చేయాలి. ఈ మిశ్రమాన్ని పూటకు అర టీస్పూన్‌ చొప్పున రెండు పూటలా అర కప్పు నీటితో తీసుకోవాలి. దీంతో కీళ్ల నొప్పుల నుంచి బయట పడవచ్చు.

2. వెల్లుల్లి పాయలను 10 గ్రాముల చొప్పున తీసుకుని ముద్దగా నూరి అర గ్లాసు పాలకు కలిపి పాలు చిక్కపడే వరకు మరిగించి రోజుకు ఒకసారి చొప్పున తీసుకోవాలి. సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

3. ఆముదం పప్పును ఒక గింజతో మొదలు పెట్టి రోజుకు ఒక గింజ చొప్పున పెంచుతూ ఏడు రోజులకు ఏడు పప్పులను తిని ఎనిమిదో రోజు నుంచి ఒక్కో గింజను తగ్గించుకుంటూ తినాలి.

4. గసగసాలను నీళ్లలో నానబెట్టి ఆ నీళ్లను తాగుతుంటే కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

*5. అర టీస్పూన్‌ శొంఠి పొడి, టీస్పూన్‌ నువ్వుల పొడి, అర టీస్పూన్‌ బెల్లంలను కలిపి ముద్దగా నూరి దాన్ని రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.*

6. అర కప్పు శొంఠి కషాయంలో రెండు టీస్పూన్ల ఆముదం కలిపి రెండు పూటలా తీసుకోవాలి.

*7. లేత మునగ ఆకులను నెయ్యిలో వేయించి తింటుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.*

8. ఈత వేరు బెరడును కషాయంగా చేసుకుని తాగుతుంటే కీళ్ల నొప్పుల నుంచి బయట పడవచ్చు.

*9.#ప్రక్కటెముకలలో_వాపులు_నొప్పులు_నివారణకు*     
            జిల్లేడు ఆకుల రసం
గోధుమ పిండి

       గోధుమ పిండిలో జిల్లేడు ఆకుల రసం కలిపి పిసికి నొప్పి వున్నచోట పట్టు వేస్తె నొప్పి తగ్గుతుంది

*10.-#కీళ్లలో_గుజ్జు_శక్తి_పెరగడానికి*                                      

           జువ్వి పండ్లు ( ప్లక్ష వృక్షము)  ఎన్ని దొరికితే అన్ని తెచ్చి వారిని రెండేసి ముక్కలుగా చేసి బాగా ఎండ బెట్టాలి. బాగా మందంగా వున్న కుండను శుద్ధి చేసి బాగా కడగాలి.  కుండను తేమ లేకుండా బాగా ఎండబెట్టాలి.
        ఆ కుండలో ఎండిన పండ్లను పోసి అవి  మునిగేంతవరకు  తేనె పొయ్యాలి.  ఎండిన జువ్వి పండ్లు  తేనెను పీల్చుకుంటాయి. మరలా మునిగే వరకు తేనె పోయాలి.
 కుండ మీద మూకుడు బోర్లించాలి. ఒక గుడ్డకు బంక మట్టిపూసి కుండలోకి గాలి చొరబడకుండా
 మూకుడు, కుండ కలిసే చోట సీల్ చేయాలి.   ఆ కుండను గాలి తగలని .చోట ఒక మూలగా 30 రోజులు ఉంచాలి.  అది బాగా మగ్గి హల్వా లాగా తయారవుతుంది.
       దీనిని ప్రతి రోజు ఒక అర టీ స్పూను తీసుకొని తింటూ వుంటే కీళ్లలో గుజ్జు పెరగడమే కాక వీర్య వృద్ధి, శక్తి 
వృద్ధి జరుగుతుంది.

*11.- కీళ్లలో గుజ్జు అరిగిపోతే  --- పెరగడానికి*                       

       తుమ్మ బంకను తెచ్చి రెండు చుక్కలు  నెయ్యి వేసి వేయించి , దంచాలి . దానికి సమానంగా కలకండ పొడిని కలపి
నిల్వ చేసుకోవాలి .

      ప్రతి రోజు ఉదయం , సాయంత్రం అర టీ స్పూను పొడి చొప్పున తిని పాలు తాగాలి
      ఈ విధంగా చేయడం వలన   కీళ్ళ మధ్య అరిగిపోయిన గుజ్జు బాగా పెరుగుతుంది .

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: https://fb.me/Q0d6Su5C
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
*ఫోన్ - 9703706660*
      This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group

ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/HelathTipsbyNaveen

No comments:

Post a Comment