Friday 21 July 2023

కిడ్నీలో_రాళ్ల_సమస్యనుంచి_బయట_పడాలంటే ఆయుర్వేదంలో చెప్పిన వంటింటి సలహాలు పాటిస్తే.. ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు

#కిడ్నీలో_రాళ్ల_సమస్యనుంచి_బయట_పడాలంటే ఆయుర్వేదంలో చెప్పిన వంటింటి సలహాలు పాటిస్తే.. ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

1.-కిడ్నీ లో స్టోన్స్ కరగాలంటే ఒక స్పూన్ నిమ్మ రసం, తేనె మిశ్రమాన్ని క్రమం తప్పకుండా ఆరు నెలలు తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్ళు నివారించబడటమే కాకుండా తిరిగి కిడ్నీలో రాళ్ళు వచ్చే సమస్యే ఉండదు.
2.-నిమ్మ రసంలో సైంధవ లవణం కలుపుకొని తాగడం వలన మూత్ర పిండాల్లో రాళ్ళు కరిగిపోతాయి.
3.- పుచ్చకాయలో నీరు, పొటాషియం ఎక్కువగా ఉండటం వలన పుచ్చకాయ జ్యూస్ లేదా ముక్కల రూపంలో ప్రతి రోజూ తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి.
4.-నీరు, నిమ్మరసం మిశ్రమంలో కొద్దిగా తేనె లేదా బెల్లం కలుపుకుని ప్రతి రోజూ ఉదయం సాయంత్రం తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయట.
5.-కిడ్నీ లో స్టోన్స్ నివారణకు వారంలో ఒకసారి ఖాళీ కడుపుతో దానిమ్మ జ్యూస్ కాని, దానిమ్మ గింజలు కాని తీసుకోవడం చాలా బెస్ట్ రెమిడీ అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
6.-ప్రతి రోజూ ఉదయాన్నే కొబ్బరి నీళ్ళు తాగితే కిడ్నీ స్టోన్స్ తో పాటు ఇతర వ్యర్ధాలు తొలిగిపోతాయి.
7.-కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ రసాన్ని ఒడకట్టి ఒక సీసాలో పోసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ప్రతి రోజూ తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు యూరియన్ రూపంలో బయటకు పోతాయి. కిడ్నీలను శుభ్రపరచడానికి కొత్తిమీర సహజమైన ఔషధమని నవీన్ రోయ్ నడిమిటి వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
8.-అలోవేర జ్యూస్ తాగితే మూత్ర సమస్యలు తగ్గుతుంది 
9.- Apple cider vinegar ప్రతిరోజూ ఉదయం ఒక టేబుల్ స్పూను 200 ml లో కలుపుకొని తాగితే మంచిది. ఆపిల్ లో వుండే మాలిక్ ఆసిడ్ ఈ పేరుకొని వున్న క్యాల్షియం ని శరీరం నుండి బయటకు పంపించి వేస్తుంది. ( It acts like a hammer to the stone). ఇది అత్యం త ప్రభావవంతం అయినది.

10.- పప్పు దినుసులు, జీడి పప్పు, బాదం పప్పు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, అరటి పండ్లు, ఆకు కూరల్లో మెగ్నీషియం అధికంగా లభిస్తుంది.
వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు క్యాల్షియమ్ బయటకి పంపబడుతుంది.

11.- నేల ఉసిరి ఆకు పొడి రోజుకి 4 గ్రాములు నీటిలో కలుపుకొని తాగడం వల్ల కిడ్నీ ల్లో, అన్ని మృదు కణజాలం లో పేరుకొని వున్న క్యాల్షియం శరీరం నుండి బయటకు పంపించి వేయ బడుతుంది.

12.-కిడ్నీలను ప్రభావితం చేసే ఆహార పదార్థాలు నవీన్ రోయ్ సలహాలు

A.-అతిగా మద్యం సేవించడం వలన కిడ్నీలు దెబ్బతింటాయి.

B.- అధికమైన ఉప్పును ఆహారంలో తీసుకుంటే అది అధిక ఒత్తిడి, మూత్రపిండాలకు హాని కలిగించే ద్రవం మొత్తాన్ని పెంచుతుంది.

C.- పాలు వెన్న జున్ను లాంటి పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవడం మూత్రపిండాలకు మంచిది కాదు.

D.- మాంసాహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వలన మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది.

E .- చేప తినడం వల్ల పెద్దగా హాని ఉండదు.

F.- టమాటాల వినియోగం కూడా అదుపులో ఉంచాలి.

G.- శీతల పానీయాలు మూత్రపిండాల తీవ్రమైన హాని చేస్తాయి.

H.- ఆహారంలో చక్కెర శాతాన్ని తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

*13.-కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు తినకూడని పదార్థాలు ఏవి ?*
నాకు తెలిసినవి 
పాలకూర,
 టమాటో, 
క్యాబేజి

     పైన చెప్పిన సలహాలు ఏవి అందుబాటులో ఉంటె వాటిని పాటిస్తూ.. రోజూ ఐదు లీటర్లకు తక్కువ కాకుండా నీటిని తీసుకోవడం వలన కిడ్నీ స్టోన్స్ ఖచ్చితంగా కరిగిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

No comments:

Post a Comment