Thursday 27 July 2023

కాళ్ళ పగుళ్ళు తగ్గటానికి వైద్య నిలయం సలహాలు

*కాళ్ళ పగుళ్ళు తగ్గటానికి వైద్య నిలయం సలహాలు .*

 శరీరంలో అన్నింటికంటే పాదాలు చివరగా నుండడం వలన రక్త ప్రసరణ సరిగా అందక, ఆ పాదాల చర్మం బిరుసుగా మారి . ఉంటుంది. లావున్నవారికి, రక్త ప్రసరణ సరిగా లేనివారికి ఈ సమస్య చలికాలం మరీ ఎక్కువ అవుతుంది. పాదాలను సరిగా తోముకోనందువల్ల పగుళ్ళు ముఖ్యముగా వస్తాయి. పగుళ్ళ మధ్య మట్టి పేరుకుపోయి, ఆ భాగంలో క్రొత్త చర్మం పుట్టకపోవడంతో, ఉన్న చర్మం బిరుసెక్కి పగిలిపోతూ ఉంటుంది. కాళ్ళను, 10, 15 రోజులలో చాలా అందంగా చేసుకోవచ్చు.

*తగ్గటానికి కొన్ని నవీన్ రోయ్ సలహాలు :*

1. పాదాలకు కొబ్బరినూనె గాని, ఆముదం గాని రాసి వాటిని వేడినీటిలో పెట్టి అలా 20, 25 నిమిషాలు ఉంచండి. ఈ లోపు వేడి నీటిలో ఆ మట్టి కరిగి మొద్దు బారిన చర్మం మెత్తబడుతుంది. పాదాలను తీసి బట్టలు ఉతికే బ్రష్ పెట్టి పగిలిన భాగంపై రుద్దండి. నాచిన చర్మం శుభ్రంగా ఊడి తేలిగ్గా వచ్చేస్తుంది. ఇలా ఆ చర్మాన్ని మనం తీయడం వల్ల అక్కడ కొత్త చర్మాన్ని శరీరం తయారు చేస్తుంది. పాదాలను శుభ్రంగా తుడిచివేయండి. వాటికి కొబ్బరి నూనె మరలా కొంచెం రాయండి. ఇలా. రాయడం వల్ల ఆ చర్మం మెత్తగా, రోజంతా బిరుసెక్కకుండా ఉండడానికి మంచిది.

2. పగుళ్ళు లేనివారు పగుళ్ళు రాకుండా ఉండాలంటే వారానికి రెండుసార్లు స్నానానికి వెళ్ళేముందు కొబ్బరినూనె రాసుకుని వెళ్ళి, నీళ్ళు పోసుకునేటప్పుడు పాదాలను బ్రష్ పెట్టి రుద్దితే ఆ భాగంలో మట్టిపోయి శుభ్రంగా.. ఉంటాయి. స్నానం అయ్యాక కొంచెం కొబ్బరి నూనె తేలిగ్గా అక్కడ పూస్తే మెత్తగా ఉంటాయి.

 అవకాశమున్నవారు బూట్లు రోజూ వాడగలిగితే కాళ్ళు మెత్తగా ఉండి పగుళ్ళు రాకుండా ఉంటాయి.
పూర్తి వైద్య సలహాలు కోసం
https://chat.whatsapp.com/DqK0Z5NnMVw3v8DHmCiMOx

No comments:

Post a Comment