Thursday 15 February 2024

అధిక వేడి కారణం తో చర్మం పై సెగ గడ్డలు నివారణకు_ఆయుర్వేదం_లో Naveen Nadiminti సలహాలు

*అధిక వేడి కారణం తో చర్మం పై సెగ గడ్డలు నివారణకు_ఆయుర్వేదం_లో Naveen Nadiminti సలహాలు*                     
                           
1.-#సెగ_గడ్డల_నివారణకు_సుర_దారు_లేపనం

         ఇవి  ముఖ్యంగా ఒత్తిడి పడే చోట వస్లీ మళ్లీ వస్తుంటాయి.

దేవదారు చెక్క పొడి                   ---- 100 gr
దోరగా వేయించిన శొంటి పొడి       ---- 100 gr
నవాసాగర చూర్ణం                      ---- 100 gr  ( అమోనియం క్లోరైడ్ )

        విడివిడిగా చూర్ణాలు చేసి కలిపి భద్ర పరచుకోవలి                                                                                        

*లక్షణాలు :-*   రబ్బరు బంతి లాగా,  గడ్డ లాగా వుంటుంది.  క్రమంగా ముదురు రంగుకు మారుతుంది.  దీని మీద   వెంట్రుకలు మొలుస్తాయి.  వీటిని గిల్లకూడదు.  వేడి నూనె వంటివి పడకుండా చూసుకోవాలి. 

           నాణ్యమైన టేప్  ను  వీటి మీద అంటిస్తే  క్రమిపి తగ్గి  అణిగి పోతాయి.

           మిరియాలను కొబ్బరి నూనెలో వేసి కాచి  చల్లార్చి పూయాలి.

     2.-  *#సెగ_గడ్డలు_లేక_చీము_గడ్డలు_నివారణకు*                                         

       ఇవి ఎక్కువగా వచ్చే ప్రదేశాలు :-- చర్మం మీద,  మొటిమలలో ఇన్ఫెక్షన్ చేరడం వలన,
 చంకలలో, గజ్జలలో మాటి మాటికి రావడం, పిరుదుల ముడతలలో( ఎక్కువగా కూర్చోవడం వలన ) చర్మంలో  చెక్క పేళ్లు  గుచ్చుకోవడం వలన  మొదలగునవి.

            వేప మలాం ( Neem Ointment)

 తేనె మైనం      --- 60  gr
  తాజా పచ్చి వేపాకులు          --- 25 gr 
   నువ్వుల నూనె    --- 50 gr

          వేపాకులను కల్వంలో వేసి నీళ్ళు చల్లుతూ మెత్తగా ముద్దగా నూరాలి.

          ఒక గిన్నెలో నువ్వుల నూనె పోసి స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తరువాత
 దానిలో వేపాకుల ముద్దను వేయాలి. సన్న మంట మీద తేమ ఇంకి పోయే వరకు కలియబెట్టాలి.
 తరువాత వడకట్టి  వేడిగా ఉండగానే దానిలో తేనె మైనం కలపాలి. ( తేనె మైనాన్ని ముందే వేడిచేసి
 వడకట్టి పెట్టుకోవాలి)   దీనిని వెడల్పు మూత కలిగిన సీసాలో పెట్టి చల్లారిన తరువాత మూత
 పెట్టాలి.
              దీనిని చీము పట్టిన గడ్డలపై పూయాలి . గడ్డ పగులుతుంది. పగిలిన గడ్డలపై పూసినా
  త్వరగా మానిపోతాయి.  దీనిని గాయాలకు కూడా వాడవచ్చు. 

               వేడి నీటిలో ఉప్పు వేసి దానిలో గుడ్డను ముంచి పిండి గడ్డలపై కాపడం పెడితే వాపు
  తగ్గుతుంది.వైద్య నిలయం సలహాలు 
https://fb.me/4Pmik3puu
 3.- *శరీరంలో_ఎటువంటి_గడ్డలు_వున్నా_నివారణకు*        

          పెరుగు            --- 50 gr
          తులసి రసం     --- 25 gr

   రెండింటిని కలిపి తాగాలి.  ఈ విధంగా రోజుకు రెండు సార్లు తాగాలి.
   ఈ విధంగా చేయడం వలన శరీరంలో ఎటువంటి గడ్డలు వున్నా కరిగిపోతాయి.

           సెగ గడ్డలు    ---  నివారణ             

       
    వేడి చేసే పదార్ధాలు వాడకూడదు .    ఎంతటి వేడి చేసిన సమస్యలకైనా  అతిమధురం వాడడం చాలా  శ్రేష్ట కరం

    అతిమధురం పొడిని నీటిలో వేసి కాచి తాగాలి ,

    కలబందగుజ్జు లో పసుపుపొడి కలిపి గడ్డ మీద వేసి కట్టు కట్టాలి ,  లేదా మట్టి పట్టి వేయవచ్చు .

*తీసుకోవలసిన_జాగ్రత్తలు :--*

    బార్లీ నీళ్ళు, తీపి దానిమ్మ రసం , పలుచని మజ్జిగ  ఎక్కువగా వాడాలి ,

    వరుణముద్ర  వేయాలి . బొటనవ్రేలి  చివర ,  చిటికెన వ్రేలి చివర  కలిపి మిగతా మూడు వ్రేళ్ళను కిందికి దించాలి .
    చంద్రభేదన ప్రాణాయామం చేస్తే  వేడి బాగా తగ్గుతుంది .
#ధన్యవాదములు 🙏,
మీ Naveen Nadiminti,
ఫోన్ - 097037 06660,
        This group create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment